రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్ పతాకంపై కట్టెల లక్ష్మణరావు, కోసూరు సుబ్రహ్మణ్యం 'టీ-సమోసా-బిస్కెట్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'భైరవ'ఫేమ్ గులాబి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీహరి, హంసానందిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం
కోసం సారథి స్టూడియోలో వేసిన ఇరానీహోటల్ సెట్లో సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది .ఈ నెల
ఆఖరి వారంలో ప్రారంభం అయ్యే చివరి షెడ్యుల్ లో క్లైమాక్స్ చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని
-నిర్మాతలు తెలిపారు .ఈ చిత్రం గురించి శ్రీహరి మాట్లాడుతూ- ఇరానీచాయ్ పేరు వినని వారు, తాగనివారు ఉండరు. ఒకప్పుడు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే టీ కూడా నేడు సామాన్యుడు తాగలేని పరిస్థితి ఎదురైంది. ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోతున్న ఈ నేపథ్యంలో నాకు బాగా నచ్చిన కథతో తీస్తున్న చిత్రం ఇది. దర్శకుడు గులాబిశ్రీను బాగా తెరకెక్కిస్తున్నారు' అని చెప్పారు.దర్శకుడు మాట్లాడుతూ...'భైరవ చిత్రం తర్వాత శ్రీహరి గారు నాకు మరో అవకాశం కల్పించారు.సినిమా బాగా వస్తోందని అన్నారు.సయాజీ షిండే,పోసాని,ధర్మవరపు,తమ్మారెడ్డి భరద్వాజ,యు.బి.రాజు, జీవా, యల్.బి.శ్రీరాంతదితరులు, నటిస్తున్న ఈ చిత్రానికిసంగీతం:వందేమాతరం శ్రీనివాస్, కెమెరా:వి.శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొండపల్లినందు, సమర్పణ: డా.చిగురుపాటి, నిర్మాతలు:కట్టెల లక్ష్మణరావు, కోసూరు సుబ్రహ్మణ్యం