Manchu Dongaata Will Hit Screens On 08th Of This Month World Wide!!
Posted on: May 01, 2015
మంచు లక్ష్మి నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’. అడివి శేష్, బ్రహ్మానందం, మధు నందన్, ప్రభాకర్ కీలక పాత్రధారులు. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ... డబ్బుకి మనిషికి మధ్యగల సంబంధం నేపధ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. వంశీకృష్ణ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. సత్య మహావీర్, సాయికార్తీక్, రఘు కుంచె ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. పాటలకు, ట్రైలర్లకు చక్కని స్పందన వస్తోంది. ‘యాందిరో’ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తొమ్మిది మంది హీరోలతో చిత్రీకరించిన మరో పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాయి మాధవ్ సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ఆద్యంతం నవ్వించే సినిమా ఇది. అవుట్పుట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మే 8న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపారు.