Mana Oori Ramayanam grand release on Dussera October 07th
Posted on: Sep 27, 2016
అక్టోబర్ 7న 'మనవూరి రామాయణం' విడుదల
శ్రీ రామనవమి పండగరోజున జరిగే ఒక సంఘటనతో ఈ 'మనఊరి రామాయణం' చిత్ర కథ నడుస్తూ ఉంటుంది. ఈ కథ రామాయణం ఇతివృత్తానికి దగ్గరగా ఉంటుంది. రాముడి రూపంలో ఉండే రావణుడి కథే ఇది. ఈ చిత్ర కధనం అంతా కూడా వ్యక్తుల భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
హరికథలో చెప్పిన విధంగా రావణుడు రాముడిగా మారినప్పుడు హనుమంతుడితో రాముడిని చంపమని సీత చెప్పినపుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడా..! రాముడిని చంపాడా..! అనే విధంగా ఈ పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది అదే మనఊరి రామాయణం.
ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నటువంటి ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం (తెలుగు) ఇదొల్లె రామాయణ (కన్నడ ) . ఈ సినిమాని హైదరాబాద్ లోని షాద్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కర్ణాటక కూర్గ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. జాతీయ అవార్డుగ్రహితులైనటువంటి సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ప్రకాష్ రాజ్, ప్రియమణి,ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కళా దర్శకుడు శశిధర్ ఆడప,వంటి కళా నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేయటం విశేషం.
మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 'యు' సర్టిఫికెట్ పొందింది. ప్రముఖచిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'అభిషేక్' పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 7న రెండు తెలుగురాష్ట్రాల ప్రేక్షకులను అలరించటానికి 'మనవూరి రామాయణం'వస్తోందని తెలిపారు 'ప్రకాష్ రాజ్'
ప్రకాష్రాజ్,ప్రియమణి,సత్యదేవ్(జ్యోతిలక్ష్మిఫేమ్),పృథ్వీ,రఘుబాబు. కథ : జాయ్ మాథ్యూ, సంగీతం : మాస్ట్రో ఇళయరాజానిర్మాతలు : ప్రకాష్ రాజ్, రామ్ జీ : స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్